10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

ఐవీఆర్

శుక్రవారం, 13 జూన్ 2025 (13:34 IST)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు నానా తంటాలు పడుతూ వచ్చిన భూమి చౌహాన్ అనే మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అది ఎలాగంటే... విమానం ఎక్కేందుకు ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. ఐతే విపరీతమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆమె విమానాశ్రయానికి వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనితో విమానం ఎక్కేందుకు కుదరదనీ, చెక్ ఇన్ టైం అయిపోయిందంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు.
 
గేటు వద్దే ఆపేశారు. ఇంతలో ఆమె ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆమె కళ్ల ముందే టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. దీనితో ఆమె వెనుదిరిగి వెళ్లబోతుండగా.. జస్ట్ ఐదు నిమిషాల్లోనే తను ఎక్కాల్సిన విమానం కూలిపోయిందన్న వార్త విని షాక్ తిన్నది. తనను ఈ ప్రమాదం నుంచి ఆ భగవంతుడే కాపాడారంటూ ఆమె చెప్పుకొచ్చింది.
 
కాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఏఐ 171 ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమాషాలకే కూలిపోయింది. ఈ ఘటనలో 241 మంది మృతి చెందగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బైటపడ్డాడు.

#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.

Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0

— ANI (@ANI) June 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు