మహారాష్ట్రలో మాత్రమే డ్రగ్స్‌ దొరికాయా? : ఉద్ధవ్‌ ఠాక్రే

ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:53 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేయడంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో మాత్రమే డ్రగ్స్‌  దొరికాయా? ముంద్రా పోర్టులో పట్టుకున్న కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ సంగతి ఏంటని ప్రశ్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు చిటికెడు గంజాయి పట్టుకుంటే, తమ పోలీసులు 150 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సెలెబ్రిటీలను పట్టుకోవడం వారితో ఫొటోలు దిగడంపైనే వారికి ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు.

భారతీయులందరి పూర్వీకులంతా ఒకరేనని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విపక్ష పార్టీలు, రైతుల పూర్వీకులు వేరే గ్రహం నుంచి వచ్చారా అని ప్రశ్నించారు.

ఈడీని దించి వేధించడం మానుకోవాలని, ఎదురుగా వచ్చి పోరాడాలని బీజేపీపై మండిపడ్డారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉద్ధవ్‌ ఠాక్రే సవాల్‌ విసిరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు