సచిన్ జోషికి ఈడీ షాక్: రూ.410 కోట్ల ఆస్తి జప్తు

శనివారం, 15 జనవరి 2022 (18:59 IST)
టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషికి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆయన  ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. 
 
మొత్తం రూ.410 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. 
 
ఎస్సార్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. గుట్కా మరియు పాన్ మసాలా తయారీ, హాస్పిటాలిటీ వ్యాపారం చేస్తున్న సచిన్ జోషి కొన్ని సినిమాలను కూడా నిర్మించాడు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు