విక్రయానికి బ్రిటిష్ ఎఫ్-35 బి : ఓఎల్ఎక్స్‌లో సేల్స్ పోస్టర్ వైరల్

ఠాగూర్

గురువారం, 26 జూన్ 2025 (12:22 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అనూహ్యంగా ల్యాండ్ అయిన బ్రిటిష్ ఎఫ్-35 బి యుద్ధ విమానం పదిరోజులుగా అక్కడే నిలిచిపోయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఆధునిక యుద్ధ విమానాల్లో ఒకటి. దీనిని తిరిగి తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ విమానాన్ని ఓఎల్ఎక్స్ అమ్మకానికి పెట్టారంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అయ్యాయి.
 
ఓఎల్ఎక్స్ పోస్ట్ చేసినట్లుగా ఉన్న ఒక స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఎఫ్-35 యుద్ధ విమానం చిత్రాన్ని ఉంచి, దానిని నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.33 కోట్లు) అమ్మకానికి పెట్టినట్లు రాసి ఉంది. అంతేకాకుండా, ఆటోమేటిక్ పార్కింగ్, సరికొత్త టైర్లు, బ్యాటరీ వంటి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయని ఆ నకిలీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో వైరల్ అయింది.
 
అయితే, ఈ వైరల్ పోస్ట్ పూర్తిగా నకిలీదని తేలింది. ఓఎల్ఎక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇలాంటి ప్రకటన ఏదీ లేదు. ఈ విషయంపై ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ బ్రిటిష్ ఎఫ్-35బి యుద్ధ విమానానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) భద్రత కల్పిస్తోంది. ఈ విమానం యూకేకు చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భాగం.
 
ఈ గ్రూప్ ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మోహరించి ఉంది, ఇటీవలే భారత నౌకాదళంతో కలిసి సంయుక్త సముద్ర విన్యాసాలను పూర్తిచేసింది. విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి బ్రిటిష్ ఏవియేషన్ ఇంజనీర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో, యుద్ధ విమానం తన మాతృనౌకకు తిరిగి వెళ్లడం ఆలస్యమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు