దీనిపై మీడియాతో మాట్లాడిన ప్రతాప్రరావు జాదవ్, టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల సంఖ్యను ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు. రాబోయే వ్యాక్సిన్ రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రించడంలో సహాయపడుతుందని నొక్కి తెలిపారు.