మనిషి కాదు.. మృగాడు... లేగదూడపై కారు ఎక్కించి చంపేశాడు... (Video)

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (14:53 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అతికిరాతక చర్యకు పాల్పడ్డాడు. రోడ్డుపై పడుకునివున్న లేగదూడపై కారు ఎక్కించి చంపేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రోడ్డుపై పడుకునివున్న ఓ లేగదూడపైకి ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా తన హ్యూందాయ్ కారును ఎక్కించాడు. అంతేకాకుండా, మళ్ళీ వెనక్కి వచ్చి మరోమారు దానిపైకి కారును ఎక్కించాడు. దీంతో ఆ లేగ దూడ చనిపోయింది. అయితే, తన బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి ఆవు తల్లడిల్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 
 
అలాగే, అక్కడ ఉన్న 7 నుంచి 8 ఆవులు మార్గమధ్యంలో చనిపోయి పడివున్న దూడ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నంబరును తెలుసుకుని, ఆ వివరాల ఆధారంగా కారు యజమాని షేక్ షాహిద్‌గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 


 

दरिंदा।????

शेख़ शाहिद ने अपनी गाड़ी का रिवर्स गेयर लगाकर जान बूझकर गौमाता रुपी बछड़े को कुचल डाला,

बछड़े को बचाने गौमाताएँ विलाप करती रहीं।

घटना छत्तीसगढ़ के बिलासपुर की। pic.twitter.com/jWJ2iSuE96

— Anand kumar (@Anandkumar_IND) June 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు