టోక్యో ఒలింపిక్స్... బంగారం తెస్తే.. రూ.2కోట్లు: స్టాలిన్ బంపర్ ఆఫర్

ఆదివారం, 27 జూన్ 2021 (09:01 IST)
త్వరలో జపాన్‌ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది నిర్వహించాల్సిన ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి సమయంలో జరుగుతున్న క్రీడలు కావడంతో, నిబంధనలు పాటిస్తూ, క్రీడాకారులు కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహిస్తూ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌లో తమిళనాడు నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపారు. సిల్వర్ మెడల్ గెలిచిన వారికి రూ.2 కోట్లు, రజతం గెలిచిన వారికి కోటి రూపాయలను బహుమతిగా ఇస్తామని సీఎం స్టాలిన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు