Crocodile: మధ్యప్రదేశ్‌లో మహిళను పొట్టనబెట్టుకున్న మొసలి

సెల్వి

శుక్రవారం, 11 జులై 2025 (17:31 IST)
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని పాటి గ్రామంలోని కనియా ఘాట్‌లో మొసలి ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. శ్రావణ మాసం మొదటి రోజున స్నానం చేయడానికి 40 ఏళ్ల మాల్తీ బాయి నది ఒడ్డున కూర్చుని ఉండగా, ఒక మొసలి నీటి నుండి బైటకు వచ్చి ఆమెను లోపలికి లాగింది.
 
ఆమెను రక్షించడానికి గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మాల్తీని మొసలి నదిలోకి తీసుకెళ్లిపోయింది. గ్రామస్తులలో ఒకరు ఈ భయంకరమైన సంఘటనను వీడియోలో బంధించారు. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. 
 
ఈ ఘటన అనంతరం అధికారులు అప్రమత్తం అయ్యారు. అటవీ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది. దాదాపు గంటసేపు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత, ఎదురుగా ఉన్న నది ఒడ్డున ఉన్న పొదల్లో చిక్కుకున్న మాల్తీ మృతదేహం కనిపించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు