రూ.300 కోట్ల ఆస్తికోసం మామను హత్య చేసిన కోడలు.. రూ.కోటి ఖర్చు చేసింది..

సెల్వి

గురువారం, 13 జూన్ 2024 (09:51 IST)
నాగ్‌పూర్‌లో హిట్ అండ్ రన్‌లో 82 ఏళ్ల వృద్ధుడి మరణంపై జరిపిన దర్యాప్తులో రూ. 300 కోట్ల విలువైన ఆస్తి కోసం మామయ్యను అతని కోడలు హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన మనీష్ పుట్టేవార్‌ను గత వారం, ఆమె మామ పురుషోత్తం పుట్టేవార్‌ను హత్య చేసిన ఘటనతో అదుపులోకి తీసుకున్నారు. 
 
Ms పుట్టేవార్‌ను హతమార్చేందుకు కోడలు రూ.కోటి రూపాయిలు సుఫారీ ఇచ్చిందని విచారణలో తేలింది. ఇంకా ఈ హత్యను ప్రమాదంగా చూపించడానికి ఇది జరిగింది. ఇది అతని రూ. 300 కోట్ల ఆస్తిపై కైవసం చేసుకునేందుకు జరిగిన కుట్రగా పోలీసులు నిర్ధారించారు. 
 
53 ఏళ్ల మహిళ తన భర్త డ్రైవర్ బాగ్డే, మరో ఇద్దరు నిందితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లతో కలిసి హత్యకు పథకం వేసిందని అధికారి తెలిపారు. పోలీసులు వారిపై హత్యతో పాటు ఐపీసీ, మోటారు వాహనాల చట్టం కింద ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు