జాతిపితను చంపిన గాడ్సే నెం.1 హిందూ టెర్రరిస్ట్: అసదుద్ధీన్ ఓవైసీ

సోమవారం, 12 మార్చి 2018 (08:40 IST)
హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సేనే నెంబర్ వన్ హిందూ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై తనకు నోటీసులు పంపించే దమ్మూధైర్యం ఎవరికైనా వుందా అంటూ సవాల్ విసిరారు.

రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్‌ మరో సిరియాలా తయారవుతుందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్ అయ్యారు. రవిశంకర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 
ఇంకా పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ... ముస్లింలు భారత దేశాన్ని అమ్మాలనుకోవట్లేదని.. వాళ్లు 70 ఏళ్ల నుంచి దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలంతా పాకిస్థాన్, సిరియా వెళ్లాలని కొందరంటున్నారని.. ఇప్పటికే చాలామంది పాకిస్థాన్‌కు వెళ్లిపోయారని ఒవైసీ తెలిపారు. 
 
తమ పూర్వీకులు కూడా బ్రిటీష్ వారితో పోరాటం చేశారని.. హిందూస్థాన్ జిందాబాద్ అన్నారని ఓవైసీ గుర్తు చేశారు. తాము భారత్‌లోని జీవిస్తాం.. ఇక్కడే ప్రాణాలు కూడా కోల్పాతమని ఓవైసీ ఉద్ఘాటించారు. ట్రిపుల్‌ తలాక్‌ ప్రధానిపై పనిలో పనిగా ఓవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ముస్లింలకు శత్రువంటూ దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు