కంప్టీ గార్డ్స్ రెజిమెంటల్ సెంటర్‌లో సైనికాధికారులకు ఘన నివాళి

గురువారం, 9 డిశెంబరు 2021 (17:17 IST)
Guards Regimental Centre
తమిళనాడులో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో సీడీఎంస్ బిపిన్ రావత్‌తోపాటు ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందారు. వీరు నీలగిరిలోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలను సందర్శించినప్పుడు ఐఎఎఫ్ ఎంఐ-17వి5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. 
JCOs & Other Ranks of Guards Regimental Centre paying homage
 
ఈ నేపథ్యంలో కంప్టీలోని గార్డ్స్ రెజిమెంటల్ సెంటర్‌లో బిపిన్‌తో పాటు పివిఎస్ఎమ్, యువైఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, వైఎస్ఎమ్, ఎస్ ఎమ్, విఎస్ ఎమ్, ఎడిసిలకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికాధికారులకు నివాళులు అర్పించారు.  
Wreath laying by Commandant Guards Regimental Centre
 
ఇకపోతే.. 1958 మార్చి 16న జన్మించిన జనరల్ బిపిన్ రావత్ 1978 డిసెంబరులో 11 గూర్ఖా రైఫిల్స్‌లో నియమించబడ్డారు. తన ప్రఖ్యాత వృత్తిపరమైన రికార్డులో, ఆయన పలు క్లిష్టమైన వివిధ క్లిష్టమైన నియామకాలను నిర్వహించారు. 
Wreath laying by Lance Naik Ram Kumar Tamang of 5th Battalion of 11 Gorkha Rifles.
 
బిపిన్ రావత్ 26వ సైనిక అధిపతిగా, జనవరి 2020లో భారతదేశం యొక్క మొదటి సిడిఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే జాతీయ భద్రతలో త్రి-సేవల ప్రయత్నాలను సమన్వయపరచడంలో కీలక పాత్ర పోషించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు