వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తొలగింపు.... నెటిజన్ల ఫైర్

గురువారం, 9 డిశెంబరు 2021 (12:43 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు నుంచి విరాట్ కోహ్లీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తొలగించింది. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "షేమ్ ఆన్ యు" అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ, కార్యదర్శిగా జై షాలు సిగ్గుపడాలన్నారు. 
 
కెప్టెన్సీ కోహ్లీ తొలగింపుపై ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యంగా, గంగూలీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బీసీసీఐ చీఫ్ గంగూలీపై ఉన్న గౌరవం పోయిందన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
"కోహ్లీని ఎందుకు తొలగించారు. 95 మ్యాచ్‌లలో 65 మ్యాచ్‌లలో వజియం సాధించి పెట్టినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా?, అలా అయితే, ధోనీ, గంగూలీ సారథ్యంలోని జట్లు  కూడా ప్రపంచ కప్ పోటీల్లో ఓడిపోలేదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు