సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ : భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

బుధవారం, 8 డిశెంబరు 2021 (20:58 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలో సౌతాఫ్రికాలో క్రికెట్ సిరీస్ పర్యటన కోసం వెళ్లనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికే 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఇపుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా జట్టును ప్రకటించింది. 
 
మొత్తం 18 మందితో ఈ జట్టును ఎంపిక చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. 
 
అయితే, జట్టులో రహాన్, పుజారాలకు మరో అవకాశం ఇచ్చారు. అలాగే, జట్టులో కొత్తవారికి చోటు కల్పించకపోగా, జడేజా, గిల్, అక్షర్ పటేల్, చహర్‌లకు మాత్రం గాయాల సాకుతో విశ్రాంతి నిచ్చారు. స్టాండ్ బై ఆటగాళ్లుగా సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చహర్, అర్జాన్ నగ్వాస్‌ వాలాలను ఎంపిక చేశారు. 
 
భారత జట్టు వివరాలు.. 
కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎస్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహాన్, శ్రేయాస్ అయ్యర్, విహారి, పంత్, సాహూ, అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, ఠాకూర్, మహ్మద్ సిరాజ్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు