దేశ ప్రజలకు ప్రధాని మోడీ హోలీ శుభాకాంక్షలు

సోమవారం, 29 మార్చి 2021 (08:56 IST)
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని ట్వీట్‌ చేశారు.
 
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి చాలా రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటంపై నిషేధం అమలులో ఉన్నది. కాగా, ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 62 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలకు సమీపంలో ఉన్నది. 
 
మరోవైపు, పాకిస్థాన్‌లోని ఒక ప్రాచీన శివాలయానికి చెందిన సెక్యూరిటీ సిబ్బందిపై అక్కడి హిందూ సముదాయానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
హోలీ వేళ ఆలయంలో దర్శనానికి, పూజలు చేసేందుకు ఆ సెక్యూరిటీ సిబ్బంది తమను అనుమతించలేదని వారు ఆరోపించారు. మన్‌షెరా జిల్లాలోని గంధియాన్ పరిధిలో గల ఈ ఆలయానికి చెందిన సెక్యూరిటీ సిబ్బందిపై శ్యామ్ లాల్, సజ్జన్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఆలయంలోకి రానివ్వకుండా చేయడం చట్టవ్యతిరేకమని వారు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు