జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉధంపూర్లోని దుడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. వీరు జైషే మహమ్మద్ ముఠాకి చెందిన వారని సమాచారం. వీరిని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది.