ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఒకేరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వేర్వేరుగా భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు, ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. దీనిపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ, ఇది నిజమని తాను నమ్మడం లేదన్నారు. ఆగస్టు 5వ తేదీన ఏమీ జరగదని తాను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నానని తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.