పది రూపాయలు అడిగిన కుమారుడు.. గొంతు నులిమి హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?

మంగళవారం, 13 జూన్ 2023 (08:21 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పది రూపాయలు అడిగిన కన్నబిడ్డను కసాయి తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో బీలేశ్ భూయాన్ (48) అనే వ్యక్తికి భార్య, 15 యేళ్ల కుమార్తె, 12 యేళ్ల కుమారుడు పప్పు యాదవ్ ఉన్నారు. వీరంతా కలిసి వశిష్ట నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. ఈ క్రమంలో బాలుడు పది రూపాయలు ఇవ్వాలంటూ తండ్రిని కోరాడు. 
 
అప్పటికే పీకల వరకు మద్యం సేవించి, తీవ్ర ఆగ్రహంతో ఉన్న భుయాన్... విచక్షణ మరిచి, అతి కిరాతకంగా కుమారుడిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అదేసమయంలో వారి కుమార్తె ఇసుకబట్టీలో తన పని ముగించుకుని ఇంటికి రాగా, ఆమె తండ్రి చేసిన ఘోరం చూసి భయంతో బిగ్గరగా కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు భుయాన్‌తో పాటు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
రాహుల్ గాంధీకి ఊరట.. ఎందుకో తెలుసా?  
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోమారు ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆయనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బాంబే హైకోర్టు పొడగించింది. ఆగస్టు 2వ తేదీ వరకు ఆయన ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకుగాను బీజేపీ నేత మహేశ్ 2021లో హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 
 
దీన్ని విచాణకు స్వీకరించి, కేసు విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల చేపట్టిన జస్టిస్ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా మరోమారు మినహాయింపును కోర్టు పొడగించింది. 
 
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు...
తెలంగాణ రాష్ట్రం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ వచ్చిన ఆయన హైదరాబాద్ నగరంలోని ఏజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. దయాకర్ రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర తెలంగాణ నేతలు, ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
కాగా, దయాకర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమరచింత నియోజకవర్గానికి రెండుసార్లు, మక్తల్ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు. అలాగే, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. ఆయన స్వస్థలం పాలమూరు జిల్లాలోని పర్కపురం గ్రామం. అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు