టీ కోసం భార్యాభర్తల గొడవ.. భార్య నదిలో దూకేసింది.. మొసలి కనిపించింది.. చివరికి?

సెల్వి

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (10:01 IST)
Crocodile
టీ కోసం భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ వివాదం కాస్త చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో భార్య కోపంతో సమీపంలో ఉన్న నదిలోకి దూకింది. అయితే క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమెకు దూకిన తర్వాత తప్పు అనిపించి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఒడ్డుమీదున్న భారీ మొసలిని చూసి ఒక్కసారిగా ఖంగుతింది. ఆపై భయంతో వణికిపోయిన ఆ మహిళ.. చివరికి ఒక పని చేసి ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటన కాన్పూర్‌లోని అహిర్వాన్‌లో చోటుచేసుకుంది. 
 
సురేష్ అనే వ్యక్తి తన భార్య మాల్టితో తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి కూడా అలానే తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తన భార్యను టీ తయారు చేయమని అడగగా.. తాను బాగా అలసిపోయానని.. ఇప్పుడు పెట్టలేనని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాదన మొదలైంది. 
 
దీంతో కోపంతో నదిలో దూకేసింది.  దీంతో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని.. ఒడ్డు వైపుకు ఈదుకుంటూ వచ్చింది. ఆమె ఒడ్డుకు చేరుకోగానే అకస్మాత్తుగా నీటిలో ఒక పెద్ద మొసలి కనిపించింది. అప్పుడే తనకు సమీపంలో ఒక చెట్టు కనిపించింది. ఎలాగైన తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో.. ఆమె త్వరగా దానిపై ఎక్కి రాత్రంతా అక్కడే కూర్చుంది. మరుసటి రోజు ఇంటికి చేరుకుంది. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను చెట్టుపై నుంచి కిందకు దించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు