నవజాత శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయిన తల్లి.. ఎక్కడ?

ఠాగూర్

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (17:56 IST)
ఓ మహిళ నవజాత శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది. ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆ మహిళ మతిమరుపు కారణంగా తన బిడ్డను మర్చిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శుక్రవారం రాత్రి చిన్నారిని నిద్రపుచ్చిన అనంతరం తల్లి ఆమెను ఫ్రిజ్‌లో ఉంచి మర్చిపోయింది. కొంతసేపటికి చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఇల్లంతా వెతికినా ఆ చిన్నారి కనిపించలేదు. చివరకు రిఫ్రజిరేటర్‌లో అపస్మారక స్థితిలో శిశువును గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సదరు మహిళ ప్రసవానంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు