పట్టపగలు నడిరోడ్డుపై మాజీ ప్రియురాలిని పొడిచి చంపేసిన వ్యక్తి.. ఆపై గొంతుకోసుకుని?

సెల్వి

శనివారం, 25 అక్టోబరు 2025 (15:29 IST)
సెంట్రల్ ముంబైలో పట్టపగలు రోడ్డుపై తన మాజీ ప్రియురాలిని వెంబడించి, తీవ్రంగా పొడిచి చంపాడు ఒక వ్యక్తి. అపై  తానే గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడు సోను బరాయ్, కలచౌకీ ప్రాంతంలోని ఒక వీధిలో మనీషా యాదవ్ (24)పై దాడి చేశాడు. 
 
అంటే వారిద్దరు విడిపోయిన దాదాపు రెండు వారాల తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మనీషా యాదవ్‌కు తీవ్ర గాయాలు కాగా, ట్రాఫిక్ పోలీసు అతన్ని బైకుల్లాలోని డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని గంటల తర్వాత ఆమె మరణించింది. 
 
వివరాల్లోకి వెళితే.. మనీషా యాదవ్ వేరొకరితో ప్రేమలో పడిందని సోను అనుమానించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. అలాగే బ్రేకప్ కూడా అయ్యింది. శుక్రవారం ఉదయం, నిందితుడు ఆమెను మాట్లాడాలని పిలిపించుకుని తనతో పాటు కత్తిని తీసుకెళ్లాడు. 
 
చివరికి మనీషా యాదవ్ వచ్చాక సోను ఆమెను రెండు మూడు సార్లు కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తి నర్సింగ్ హోమ్‌లోకి ప్రవేశించగా ఆమెను వెంబడించాడు. ఆస్పత్రిలోనే మళ్లీ ఆమెపై దాడి చేశాడు. చుట్టుపక్కల ప్రజలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, సోనును అడ్డుకోలేకపోయారు. కానీ స్థానికులు అతనిపై దాడి చేయడంతో అక్కడ నుంచి పారిపోయాడని తెలిసింది. 
 
ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో మనీషా యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి నర్సింగ్ హోమ్ లోపల జరిగిన దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. 
 
వీడియో క్లిప్‌లలో, దాడి చేసిన వ్యక్తి నుండి బాధితుడిని రక్షించడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. మరికొందరు నిందితుడిని కర్రతో కొట్టి అతనిపై రాళ్ళు రువ్వడం చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కలాచౌకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడి, దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు