జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు

శనివారం, 20 మే 2023 (11:02 IST)
జూన్ నాలుగో తేదీన కేరళను నైరుతీ రుతుపవనాలు తాకే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల వరకూ చేరుకున్నాయి. 
 
ఇదే వేగం కొనసాగితే.. జూన్ నాలుగో తేదీకి కేరళను రుతుపవనాలు తాకే అవకాశం వుందని తెలుస్తోంది.

వాయువ్య వైపు నుంచి రాష్ట్రం దిశగా దిగువస్థాయి గాలులు కూడా వీస్తుండడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు