రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని ఫోన్ సంభాషణ

శుక్రవారం, 1 జులై 2022 (20:27 IST)
PM_putin
ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఆ ఇద్దరు నేతల మధ్య సంభాషణ కొనసాగింది. వివిధ అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, మైత్రీ సంబంధాల గురించి మాట్లాడారు.
 
2021లో వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఈ రెండు దేశాల మధ్య కుదరిన ఒప్పందాలు, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై చర్చించారు.
 
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతుండటం, ఇటీవలే జీ7 దేశాల సదస్సులో భారత్ కాస్త వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటి పరిణామాల మధ్య మోదీ.. రష్యా అధ్యక్షుడితో ఫోన్‌లో సంభాషించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
తాజాగా వ్యవసాయం, రక్షణ, వాణిజ్యం, ఎగమతి-దిగుమతులు, విదేశాంగ విధానాలపై మోడీ-పుతిన్ మధ్య సంభాషణ కొనసాగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు