రాజ్యసభ ఎన్నికల ఫలితాలు, తెదేపా 2 ఏకగ్రీవం-భాజపా 19

శుక్రవారం, 23 మార్చి 2018 (22:27 IST)
రాజ్యసభ ఫలితాల్లో భాజపా అగ్రస్థానాన్ని సాధించుకుంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో బీజేపీ 19 సీట్లు గెలుచుకోగా వాటిలో 16 స్థానాలు ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను నిలబెట్టుకుంది. 
 
తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు స్థానాలతో పాటు మరో సీటును కూడా తన ఖాతాలో వేసుకోవడంతో మొత్తం మూడు సీట్లు దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రధాన పక్షమైన వైసీపీ ఏకగ్రీవంగా 1 సీటును సాధించుకుంది. ఇంకా జేడీయూ 2, ఆర్జేడీ 2, శివసేన 1 సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ 3 స్థానాలనూ కైవసం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు