Rats Bite: ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు.. ఇద్దరు శిశువుల మృతి.. ఎలా? (video)

సెల్వి

గురువారం, 4 సెప్టెంబరు 2025 (17:08 IST)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోరం జరిగింది. ఎలుకలు పసిప్రాణాలను బలిగొన్నాయి. ఇండోర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్‌లో ఈ ఘోరం జరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
సెప్టెంబర్ 1వ తేదీ రెండు నెలల శిశువుని  పీడియాట్రిక్ సర్జరీ వార్డులో చేర్చారు. ఆ శిశువు వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, ఎలుకలు శిశువు చేతి వేళ్లను కొరికాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 
 
అయితే, అప్పటికే శిశువు పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు మృతి చెందింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే, సెప్టెంబర్ 2న, అదే ఆసుపత్రిలోని నవజాత శిశువుల వార్డులో మరో దారుణం చోటుచేసుకుంది. 
 
పుట్టిన కొన్ని గంటలకే ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచిన ఓ పసికందుని ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ ఘటనలపై ఆందోళన చెంది, కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు నిరసనలకు దిగారు.

Rats Bite 2 Newborns' fingers, head, shoulder inside ICU of a govt hospital in Indore. One of them died two days later. Maharaja Yashwantrao Chikitsalaya (MYH) is one of the biggest govt hospitals in Madhya Pradesh. pic.twitter.com/7f5NMCJ31s

— Mohammed Zubair (@zoo_bear) September 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు