ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి పదవికి ముందు వరుసలో ఉన్నారని నివేదికలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బీజేపీ నాయకత్వం రేఖ గుప్తాను ఎంచుకుంది. బుధవారం జరిగిన ఢిల్లీ బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగింది.
కేజ్రీవాల్ను ఓడించి రాజకీయంగా సంచలనం సృష్టించిన పర్వేష్ వర్మను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అదనంగా, విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.