కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల్లెలు కూతురు పవిత్ర (12)లు ఉన్నారు.
స్థానిక పోలీసుల వివరాల మేరకు... ఈనెల 24వ తేదీన మంత్రాలయంకు వచ్చిన ఈ ముగ్గురు మఠానికి చెందిన వీవీజీ వసతిగృహంలో 52 నెంబర్ గదిని అద్దెకు తీసుకున్నారు. మూడురోజుల నుంచి గదిని తెరవకపోవడం, గది నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.