అంతకుముందు బడ్జెట్ ట్యాబ్ను తీసుకుని ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రథమ పౌరురాలి అనుమతి తీసుకుని పార్లమెంట్కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది. అనంతరం వార్షిక పద్దును నిర్మలమ్మ సభకు సమర్పించారు.