అక్కాతమ్ముడిపై యూపీలో యాసిడ్ దాడి.. అసలెందుకు జరిగింది?

బుధవారం, 27 సెప్టెంబరు 2023 (11:02 IST)
యూపీలో యాసిడ్ దాడి కలకలం రేపింది. బరేలీలో ఇంట్లో నిద్రిస్తున్న సోదరీసోదరుడిపై దుండగులు యాసిడ్ బాటిల్ విసిరారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తోబుట్టువులు వారి మేనమామతో పాటు అద్దె వసతిలో ఉన్నారు. వారి తండ్రి పిలిభిత్‌లో దంతవైద్యుడు.
 
బరేలీలోని ఇజ్జత్ నగర్ ప్రాంతంలోని వారి అద్దె వసతి గృహంలో నిద్రిస్తుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వారిపై యాసిడ్ పోయడంతో 19 ఏళ్ల యువతి, ఆమె 17 ఏళ్ల సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు.
అక్కాతమ్ముడు అద్దె ఇంట్లో మేనమామతో ఉంటున్నారు. బాలిక నీట్‌కు సిద్ధమవుతోందని, ఆమె సోదరుడు బరేలీ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడని నగర అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రాహుల్ భాటి తెలిపారు. 
 
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మామ బయట నిద్రిస్తుండగా, లోపల నుంచి తాళం వేయని గదిలోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, తోబుట్టువులపై యాసిడ్ పోశారని రాహుల్ భాటి తెలిపారు.
 
ఇద్దరూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదువుకుని నిద్రకు ఉపక్రమించారని వారి తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఇక యాసిడ్ దాడికి గురైన అక్కాతమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యాసిడ్ దాడి ఎందుకు జరిగిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు