యెమెన్లోని హౌతీ రెబల్స్ నిర్వహించిన క్షిపణి, డ్రోన్ల దాడి నుంచి తప్పించుకునేందుకు నౌక ఆకస్మికంగా గట్టి ములుపుతీసుకుందని, ఆ సమయంలో విమానాన్ని లాగుతున్న సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఫైటర్ జెట్, దానిని లాగుతున్న టో ట్రాక్టర్తో సహా సముద్రంలో జారిపోయినట్టు యూఎస్ నేవీ ఓ పత్రికా ప్రకటనలో ధృవీకరించింది.
విమానాన్ని హ్యాంగర్ బే టో చేస్తుండగా సిబ్బంది నియంత్రణ కోల్పోయారు. విమానం, టో ట్రాక్టర్ సముద్రంలో పడిపోయాయి. విమానం పడే ముందు సిబ్బంది అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ఒక నావికుడుకి మాత్రం స్వల్ప గాయమైంది అని నేవీ ఓ ప్రకటనలో పేర్కొంది.