కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన తండ్రిని సజీవదహనం చేసిన ఫ్యామిలీ..

ఆదివారం, 10 జనవరి 2021 (13:03 IST)
తమ కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన ఇంటి యజమానిని కుటుంబ సభ్యులంతా కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బోదాన్ జిల్లా వాజిర్‌గంజ్ ఏరియాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వాజిర్‌గంజ్‌ ఏరియా హత్రా గ్రామానికి చెందిన అమిర్ అనే వ్య‌క్తికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కుమార్తెను నిలదీశాడు. ఇటువంటి ప‌నులు చేసి, గ్రామాంలో త‌న‌కు త‌ల‌వంపులు తీసుకురావ‌ద్ద‌ని చెప్పాడు. 
 
అంతే... ఆ కుటుంబంలో గొడ‌వ చెల‌రేగాయి. కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారు ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, 30 శాతం కాలిన గాయాలతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. అయితే, అప్ప‌టికే కుటుంబ సభ్యులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు