ఐదు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక సూచన చేసిన వాతావరణ శాఖ

శుక్రవారం, 3 జూన్ 2022 (15:59 IST)
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, ఆరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావం కారణంగా కోస్తారాంధ్రలో ఐదు రోజుల పాటు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.
 
ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల్లో కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, బీహార్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలోని కోస్తాంధ్రతో పాటు కేరళ, దక్షిణ కర్నాటక, లక్షద్వీప్‌లలో ఐదు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలుల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు