రైల్వే ట్రాక్‌ మీద గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయిన వ్యక్తి.. (Video)

ఠాగూర్

ఆదివారం, 25 ఆగస్టు 2024 (14:40 IST)
సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే పనులు కొన్ని విచిత్రంగా ఉంటాయి. కొందరు రైల్వే ట్రాక్‌లపై పడుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు హాస్యానికి విచిత్ర పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో రైల్వే ట్రాక్‌పై గొడుగు పెట్టుకుని నిద్రపోయిన వ్యక్తి. దీన్ని గమనించిన లోకో పైలట్‌ రైలును ఆపి.. అతడిని నిద్రలేపి, చీవాట్లు పెట్టి అక్కడ నుంచి పంపించాడు. 


 

యూపీలో దర్జాగా రైల్వే ట్రాక్ మీద గొడుగు వేసుకొని పడుకున్న వ్యక్తి

ఉత్తరప్రదేశ్ - ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌పై గొడుగు పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. ఇది గమనించి రైలును ఆపి, అతడిని నిద్రలేపి పంపించిన లోకో పైలట్. pic.twitter.com/QctBxMbcqf

— Telugu Scribe (@TeluguScribe) August 25, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు