తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో సినీ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు. ఈ క్రమంలో విజయ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ఆదివారం వెల్లడించారు.
ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు విజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను ఆ దుఃఖాన్ని మోస్తున్నానన్నారు. ఇది తమకు కోలుకోలేని నష్టమని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఈ డబ్బు బాధిత కుటుంబాల బాధను తీర్చదు కానీ, వారిలో ఒకడిగా అండగా నిలబడటం తన కర్తవ్యమని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.