ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ పర్యటన కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు. ఆనందీబెన్ రాజీనామాతో ఆమె వారసుడిగా బీజేపీ అధిష్టానం రూపానీకి గుజరాత్ పగ్గాలు అప్పగించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని విజయతీరాలకు నడిపించే బాధ్యతను రూపానీపై పెట్టింది.