మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. ఇండోర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో, కరోనా వైరస్ కారణంగా ఒక మహిళ మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ మహిళ కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చి కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ వచ్చింది. 
 
									
				
	 
	కానీ ఆమెకు కరోనా పాజిటివ్గా తేలడంతో చికిత్స సమయంలో మరణించింది. మహిళ మరణం తరువాత, ఆరోగ్య శాఖలో ప్రకంపనలు నెలకొన్నాయి. అదే సమయంలో, మరో 2 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.
 
									
				
	 
	ఇకపోతే.. ఇండోర్లో మరోసారి కరోనా వైరస్ సోకిన ఇద్దరు రోగులు కనుగొనబడ్డారు. వారిలో ఒకరు యువకుడు, మరొకరు వృద్ధ మహిళ. ఇద్దరినీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరికీ వేర్వేరు వ్యాధులు ఉన్నాయి. వారిలో ఒకరు కరోనా పాజిటివ్ మహిళ, ఆమె అనేక ఇతర వ్యాధులతో బాధపడుతోంది.