ఉదయం లేవగానే తల్లిదండ్రులను చూశారా...?

బుధవారం, 20 జూన్ 2018 (15:01 IST)
చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. నిద్ర లేవగానే అద్దాన్ని చూడకూడదని కొంతమంది చెబుతుంటారు.
 
ఉదయం నిద్రలేవగానే ఆవును గానీ, భార్యను గానీ, తల్లిదండ్రులను చూడాలని పూర్వికులు చెబుతుంటారు. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిది. ఆవు సకల దేవత స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆవును ఉదయాన్నే చూస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
ఉదయం అర్థాంగిని చూస్తే కూడా చాలా మంచిది. అర్థాంగి భర్త కోసమే నోములు, వ్రతాలు చేస్తుంది. అందువల్ల ఉదయాన్నే భార్య ముఖం చూసినా చాలా మంచిది. ఇక తల్లిదండ్రులను ఉదయాన్నే చూస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు, శివపార్వతులను చూసినట్లేనట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు