ఏడు కొండల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహాలైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి కవచాల సందర్భంగా ఈ ఉత్సవాన్ని తితిదే ప్రతి యేటా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా జరుగుతున్న ఉత్సవాలలో శ్రీవారికి వార్షికోత్సవాలు, వారోత్సవాలు, నిత్యోత్సవాలు జరుగుతూనే ఉంటాయి.