శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ సోమవారం శివయ్యను స్మరించుకోవాలి. ఈ రోజున శివయ్య అభిషేకం చేయించాలి. ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు. దీంతో పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని విశ్వాసం. శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధిస్తూ, ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి.