రాష్ట్రవ్యాప్తంగా 1000 దేవాలయాలను నిర్మించాలని టిటిడి బోర్డు ప్రణాళికలు ప్రకటించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఆరు దేవాలయాలు నిర్మించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో మతమార్పిడులను ఆపడం లేదా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ భారీ ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు శ్రీవాణి ట్రస్ట్ నుండి నిధులు వినియోగించబడతాయి. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలకు సంబంధించిన కీలక ఏర్పాట్లను తితిదే వెల్లడించింది.