ఇదిలా ఉంటే.. రియో ఒలింపిక్స్ అధికారులకు ఓ అనుమానం వచ్చింది. అదీ ఆసక్తికర అనుమానం. ఇదేంటి ఆసక్తిరమా.. అనుకుంటున్నారా.. అయితే చదవండి. బ్రెజిల్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా... బ్రెజిల్లో జరుగుతున్న ఒలింపిక్స్ భద్రత పర్యవేక్షించేందుకు భారత నుంచి ఇద్దరు అధికారులు వెళ్లారు.
వీరిలో తెలంగాణ పోలీస్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న రమేష్ రెడ్డి ఒకరు. ఇక భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా భారత రాయబార కార్యాలయానికి జిలేబీ, సమోసా పంపించారు. ఇక జిలేబీ రుచి చూసిన అక్కడి భద్రతా అధికారులు అది ఎలా తయారు చేస్తారనే విషయం తెలుసుకోవాలనుకున్నారు.