ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత్ తన సత్తా చాటుకుంటోంది. ఇంగ్లండ్పై ఆఖరి లీగ్ మ్యాచ్లో 69-18తో ఘన విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ధీటుగా రాణించింది. ఈ విజయంతో పూల్-ఏ నుంచి సెమీ ఫైనల్ చేరిన రెండో జట్టుగా అనూప్కుమార్ సేన రికార్డు సృష్టించింది.