అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డీగీ మారడోనా చనిపోయి నాలుగున్నరేళ్ళ సమయం గడిచిపోయింది. ఇపుడు ఆయన ఎందుకు చనిపోయారన్న విషయం వెలుగులోకి వచ్చింది. మారడోనా మానసిక వేదనతో మరణించివుంటానని పోస్టుమార్టం నివేదికలో ఓ నిపుణుడు పేర్కొన్నాడు. మారడోనా మృతి నేపథ్యంలో ఏడుగురు వైద్యు నిపుణులు హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుడు డాక్టర్ మౌరిసియో కాసినెల్లి విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండె వైఫల్యం, కాలేయ సిరోసిస్ కారణంగా మారడోనా మరణానికి ముందు కనీసం పది రోజులు ఆయన ఊపిరితిత్తుల్లోని నీరు పేరుకుపోయిందని పేర్కొన్నారు. మారడోనా బాగోగులు చూసుకునే నర్సులు, వైద్యులు ఈ విషయాన్ని గమనించి ఉండాలని న్యాయమూర్తులకు తెలిపారు.
మారడోనా గుండె సాధారణం కంటే రెండింతలు బరువు ఉంటుందని, డాక్టర్ మౌరిసియో పేర్కొన్నారు. మరణానికి కనీసం 12 గంటల ముందు ఆయన వేదన అనుభవించివుంటారని వివారించారు. మెదడులో రక్తం గడ్డకట్టుకునిపోవడంతో చేసిన ఆపరేషన్ నుంచి కోలుకున్న మారడోనా.. కొన్ని దశాబ్దాలపాటు కొకైన్, ఆల్కహాల్ వ్యసనంతో బాధపడ్డారని తెలిపారు.
మారడోనా చివరి రోజుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే వారికి 8 నుంచి 25 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మారడోనా గుండే ఆగిపోవడం ఉపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే పరిస్థితి కారణంగా మరణించినట్టు వైద్యులు గుర్తించారు.