వింబుల్డన్‌లో మెరిసిన రోహన్ బోపన్న జోడీ..

గురువారం, 13 జులై 2023 (11:41 IST)
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్ టెన్నిస్ సిరీస్ లండన్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన క్రీగ్‌స్పూర్-బార్ట్ స్టీవెన్స్ జోడీతో తలపడింది. 
 
ఇందులో రోహన్ బోపన్న జోడీ 6-7 (3-7), 7-5, 6-2తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 43 ఏళ్ల బోపన్న వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు