కావలసిన పదార్థాలు : నెయ్యి... నాలుగు స్పూన్లు బాదం పప్పు.. 250 గ్రాములు పంచదార... 250 గ్రాములు పాలు... అర లీటర్ ఏలక్కాయలు, జీడిపప్పు, సార పప్పు, పిస్తాపప్పు... చెరో పది గ్రాములు కుంకుమ పువ్వు, లేదా కేసరి పౌడర్... రెండు టీ స్పూన్లు
తయారీ విధానం : బాదంపప్పును వేడి నీటిలో నానబెట్టాలి. ఒకగంట తర్వాత బాదంపప్పుపై గల తొక్కును తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ముద్దకు 3/4 మోతాదులో నీటిని చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు మరగనివ్వాలి. తర్వాత అందులో పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, సార, పిస్తా పప్పులను కలుపుకోవాలి.
కలర్కోసం కేసరి పౌడర్, ఏలకులను కూడా చేర్చుకోవాలి. అంతే వేడివేడి బాదం పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడిగానైనా తినవచ్చు లేదా చల్లగా తినాలకునేవారు ఇరవై నిముషాలపాటు ఫ్రిజ్లో ఉంచి ఆ తర్వాత తినవచ్చు.