కావలసిన వస్తువులు : జీడిపప్పు : 10 గ్రాములు పిస్తా పప్పు : 10 గ్రాములు పచ్చకర్పూరం : చిటికెడు కుంకుమపువ్వు : చిటికెడు నెయ్యి : 4 టీస్పూన్లు బాదం పప్పు : 95 గ్రాములు చక్కెర : 200 గ్రాములు పాలు : 1/2లేదా3/4 లీటరు ఏలక్కాయ : 7 లేక 8
ఇలా చెయ్యండి: ముందుగా జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పు అన్నీ కలిపి నేతిలో వేయించుకోవాలి. బాదంపప్పును వేడి నీటిలో నానపెట్టాలి. ఓ గంట తరువాత బాదంపప్పు మీద తొక్కతీసి, మెత్తగా రుబ్బుకోవాలి. నూరిన బాదంపప్పు ముద్దకి 3/4 లీటరు నీళ్ళు కలిపి, మరగపెట్టాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు మరగనించి అందులో చక్కెర, మిగతా వస్తువులు కలపాలి. బాదంపప్పు పాయసం రెడీ... ఈ పాయసాన్ని ఆరిన తర్వాత ఫ్రిజ్లో ఉంచి అనంతరం సర్వ్ చేయొచ్చు. కూలింగ్ వద్దనుకునే వారు వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.