కావలసిన పదార్థాలు : చక్కెర... 200 గ్రాములు కొబ్బరి... సగం (కోరినది) జీడిపప్పు... 20 గ్రాములు నెయ్యి... 50 లేదా 75 గ్రాములు కేసరిపొడి... తగినంత పచ్చకర్పూరం... తగినంత ఏలక్కాయలు... 6 పలుకులు
తయారీ విధానం : నాలుగు టీ స్పూన్ల నెయ్యిలో జీడిపప్పు వేయించుకోవాలి. కొబ్బరి కోరును కూడా కలుపుకోవాలి. ఒక గరిటెడు నీరు చక్కెరకి కలుపుకుని పంచదార పాకం చేసుకోవాలి. ఆ పాకం చిక్కబడకముందే పైన వేయించినవన్నీ, కేసరిపొడి కలపాలి. ఒక్కొక్కప్పుడు పాకం చిక్కబడితే , సేమ్యా నెయ్యి కలిపి, నాలుగు ఐదుసార్లు బాగా కలపాలి. పొయ్యిమీద నుంచి దించి పచ్చకర్పూరం, ఏలక్కాయలపొడి లాంటివి కలిపి వడ్డించాలి.