కావాల్సిన పదార్థాలు పాలు- అర లీటర్ పంచదార- వంద గ్రాములు కుంకుమపువ్వు- కొద్దిగా. పచ్చ కర్పూరం- కొద్దిగా ఏలకులు- కొద్దిగా కావాలనుకుంటే పిస్తా, బాదం పప్పు, నెయ్యి- కొద్దిగా.
తయారీ విధానం ఓ పెద్ద పాత్రలో పాలు పోసి తక్కువ మంటపై కాచండి. పాలపై వచ్చే మీగడను శుభ్రమైన గరిటతో పైనుంచి తీసి మరో పాత్రలో నిల్వ చేయండి. పాలు సగం కాగిన తర్వాత వేరుగా చేర్చిన మీగడను పాలులోనే వేసి, చక్కెరను చేర్చి బాగా కలబెట్టండి.
తర్వాత కిందకు దించి సిద్ధంగా ఉంచిన కుంకుమపువ్వు, ఏలకాయ పొడి, పచ్చ కర్పూరంలను చేర్చండి. తోలుతీసిన బాదం, పిస్తా పప్పులను నెయ్యిలో వేయించి, ఇందులో కలపండి. రుచి కరమైన బాసుంది సిద్ధం మీకోసం.