కావలసిన పదార్థాలు: బియ్యం పిండి: 250 గ్రాములు పంచదార: పావు కిలో మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్: 150 గ్రాములు జీడిపప్పు: 50 గ్రాములు పాలు: ఒక కప్పు యాలకుల పొడి: ఒక టీ స్పూన్ రోజ్ వాటర్: రెండు టేబుల్ స్పూన్లు
ఇలా చేయండి: మందపాటి అడుగుతో కూడిన పాన్ను తీసుకుని అందులో పాలతో కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అందులో పంచదార చేర్చి పిండి ఉడికింతేవరకు తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌ నుంచి దించి పక్కన పెట్టుకోండి. విడిగా ఓ పాత్రలో అరకప్ పంచదార, అరకప్పు నీటితో చిక్కని పాకం రానివ్వాలి. ఈ పాకంలో రోజ్వాటర్, తరిగిన డ్రైఫ్రూట్స్ను కలిపి ఉడికించిన బియ్యం పిండి మిశ్రమంలో కలిపాలి. తర్వాత నేతితో వేయించిన జీడిపప్పును వేసి అలంకరించి సర్వ్ చేయొచ్చు.