బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

ఠాగూర్

ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:37 IST)
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లోని ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడుని బాలానగర్ జలగం సాయి సత్య శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకోవడంతో ఆయన అక్కడే కాలిపోయాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది. 
 
పటాన్‌చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు