బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కవితను భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ బహిష్కరించారు. ఈ నేపథ్యంలో కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలోకి కవితను ఆహ్వానించారు. కవితను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
బీజేపీ బ్రహ్మణుల పార్టీ. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, దొరసానివైన నిన్ను ప్రజలు నమ్మాలంటే గద్దరన్న చేరిన పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరు. ప్రజాశాంతి పార్టీలోకి రా. జూబ్లీహిల్స్లో పోరాడుదాం. రుజువు చేసుకుందాం. అందరి మనసులు గెలుచుకుందాం అని కవితకు కేఏ పాల్ ఆహ్వానించారు.